Goods Trains Derail: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా జామ్‌గావ్ రైల్వే స్టేషన్ యార్డ్‌లో నిలిచిపోయిన సరుకు రవాణా రైలును గూడ్స్ రైలు ఢీకొట్టడంతో 18 వ్యాగన్లు పట్టాలు త‌ప్పాయి. దీంతో కీలకమైన హౌరా-ముంబై మార్గంలో సోమవారం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.  

Goods Trains Derail: ఆగి ఉన్న గూడ్స్ రైలును మ‌రో గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో ఇరు రైళ్ల‌కు చెందిన 18 వ్యాగన్లు పట్టాలు త‌ప్పాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప‌లు రైళ్ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. ఈ  ఘ‌ట‌న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. జామ్‌గావ్ రైల్వే స్టేషన్ యార్డ్‌లో సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో యార్డ్‌లో నిలిచిన ఉన్న‌ గూడ్స్ రైలును అకస్మాత్తుగా మరో గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టింది.దీంతో రెండు రైళ్లకు చెందిన మొత్తం 18 వ్యాగన్‌లు ట్రాక్‌పై ప‌డిపోయాయి. దీంతో రద్దీగా ఉండే హౌరా-ముంబై మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిందని రైల్వే అధికారులు తెలిపారు.  అయితే ఎలాంటి గాయాలు కాలేదు. 

ఈ విష‌యం తెలుసుకున్న‌బిలాస్‌పూర్ రైలు డివిజన్‌కు చెందిన రైల్వే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ పునరుద్ధరణ పనులు వేగ‌వంతంగా జరుగుతున్నాయని బిలాస్‌పూర్‌లోని ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. ఈ సంఘటనకు ఖచ్చితమైన కారణం విచారణ తర్వాత మాత్రమే తెలుస్తుందని అధికారి తెలిపారు. పట్టాలు తప్పిన కారణంగా రెండు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా,  ఆరు రైళ్ల రూట్ల‌ను రిషెడ్యూల్ చేసిన‌ట్టు ఆయన తెలిపారు.