వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటన కేరళ చరిత్రలోనే అత్యంత భారీ విపత్తుగా రికార్డుల్లోకెక్కుతోంది. సైన్యం, NDRF, అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు, స్థానికులు సాహసోపేతంగా పనిచేసి ప్రాణాలను కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలో సైన్యం సాహసాన్ని కీర్తిస్తూ 3వ తరగతి విద్యార్థి రాసిన లేఖ పలువురిని కదిలిస్తోంది.