Nagarjuna Sagar: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే, నది జలాలు, విద్యుత్ పంపిణీ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది.