విశాఖపట్నంలో నేవీ అధికారులు కార్గిల్ విజయ్ దివస్ ను జరిపారు. అమరవీరులకు పుష్పగుచ్చాలు సమర్పించి, నివాళులు అర్పించారు.
గతంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కార్గిల్ అమరవీరుల త్యాగాలను గుర్తించలేదని.. పార్లమెంటులో తాను లేవనెత్తేవరకు కార్గిల్ విజయ్ దివస్ జరగలేదంటూ బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అప్పటి ఉత్తర ప్రత్యుత్తరాలను ట్వీట్ చేశారు.
కార్గిల్ విజయ్ దివాస్ 21 వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖ పట్నంలోని 'విక్టరీ ఎట్ సీ' వార్ మెమోరియల్ వద్ద నావికా దళం నివాళులు అర్పించారు.