ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోసానీ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ దుమారం రేపింది. సినిమా పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఎత్తి చూపుతూ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. మీడియా మొదలు వైసీపీ ప్రభుత్వం వరకు విరుచుకుపడ్డారు. దీనిపై సినీ రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీ పవన్పై కౌంటర్ అటాక్కు దిగారు. పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలతో రగిలిపోయిన పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పోసానీ కృష్ణ మురళీపై విరుచుకుపడ్డారు.