Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరు యువతుల ప్రేమ.. తనను కాదని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉందని...గొంతు కోసి చంపి...

మంచిర్యాల జిల్లాలో ఇద్దరు యువతుల ప్రేమ ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుందని గొంతు కోసి చంపేసి.. ఆత్మహత్యగా నాటకమాడింది. 

woman murdered girlfriend over her love affair with another man in mancherial - bsb
Author
First Published Mar 17, 2023, 6:52 AM IST

మందమర్రి : మంచిర్యాలలో నిన్న కలకలం సృష్టించిన ఇద్దరు యువతులపై దాడి ఘటనలో కొత్త  విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ ఇద్దరు యువతులు సహజీవనంలో ఉన్నారని తేలింది. ఆ ఇద్దరు యువతుల మధ్యలో ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారి సహజీవనం వరకు వెళ్ళింది. ఆ తర్వాత అందులో ఒకరు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నారన్న కోపంతో.. ఒక యువతి ఇంకో యువతిని హత్య చేసింది. ఈ ఘటన  గురువారం మంచిర్యాల జిల్లాలో కలకలం సృష్టించింది.  దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..

బుధవారం రాత్రి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికులు,మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆ ఇద్దరు యువతుల పేర్లు సల్లూరి అంజలి (21), పెరుగు మహేశ్వరి. అంజలి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు నివాసి. అదే జిల్లాలోని  నెన్నెల మండలం మన్నెగూడెంలో అంజలి అమ్మమ్మ ఉంటుంది. దీంతో తరచుగా అంజలి అక్కడికి వస్తుండేది. ఇలా అమ్మమ్మ దగ్గరికి వచ్చే క్రమంలో అదే గ్రామంలో ఉండే పెరుగు మహేశ్వరి అలియాస్ మహేష్ తో అంజలికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారి.. రెండేళ్ల కిందట మంచిర్యాలలో ఇద్దరూ గది అద్దెకు తీసుకుని ఉండడం మొదలుపెట్టారు.  

మంచిర్యాల జిల్లాలో ఇద్దరు యువతులపై దాడి, ఒకరి మృతి...!

వీరితోపాటు మహేశ్వరి చెల్లి పరమేశ్వరి, మహేశ్వరి తమ్ముడు విగ్నేష్ కూడా ఉండేవారు. స్థానికంగా ఉన్న ఓ కళ్లద్దాల దుకాణంలో అంజలి పనిచేసేది.మహేశ్వరి ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఈ మధ్యకాలంలోనే మానేసింది. మహేశ్వరి మన్నెగూడెం వీఆర్ఏ మొండికున్న అయిదుగురు ఆడపిల్లల్లో నాలుగవ కుమార్తె. మహేశ్వరి వస్త్రధారణ, ప్రవర్తన అబ్బాయిల్లా ఉండేది. గత పదిహేళ్లుగా ఆమె పూర్తిగా అబ్బాయిల్లా వ్యవహరించడం మొదలుపెట్టిందని.. ఈ క్రమంలోనే మహేశ్వరి, అంజలి సహజీవనం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలా జరుగుతుండగా శ్రీనివాస్ అనే వ్యక్తితో మహేశ్వరికి పరిచయం ఏర్పడింది.  

అతను మంచిర్యాలలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. అలా మహేశ్వరితో పరిచయమైన అతనికి ఆ తర్వాత మహేశ్వరి సోదరి పరమేశ్వరి, ఆమె తమ్ముడు విగ్నేష్.. అంజలీలతో కూడా  పరిచయం అయింది. ఈ క్రమంలో రెండు నెలలుగా అంజలి,  శ్రీనివాస్ తో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టింది. మహేశ్వరిని దూరం పెడుతూ వచ్చింది. బుధవారం నాడు కళ్లద్దాల షాపులో తన పని అయిపోయిన తర్వాత రాత్రిపూట 8.15గంటలకు అంజలి గదికి వెళ్ళింది. ఆ తర్వాత 10 గంటల సమయంలో మామిడి గట్టుకు వెళ్దామని మహేశ్వరి, అంజలిని తీసుకొని టూ వీలర్ మీద బయలుదేరింది. ఆ తర్వాత రాత్రి 11:30 గంటలకు మహేశ్వరి శ్రీనివాస్ కు ఫోన్ చేసింది. అంజలి ఆత్మహత్య చేసుకుందని… తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది.

దీంతో కంగారు పడ్డ శ్రీనివాస్ వెంటనే పరమేశ్వరికి ఈ విషయం తెలిపి.. ఆమెను తీసుకుని కారులో గుడిపల్లి గ్రామ శివారులోని..  మహేశ్వరి చెప్పిన స్థలానికి చేరుకున్నాడు. అక్కడ అప్పటికే తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అంజలిని.. కొద్దిగా  గాయాలతో ఉన్న మహేశ్వరి వీరి కంట పడింది. వెంటనే వారిద్దరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే అంజలి చనిపోయింది. అంజలి మేడ మీద లోతైన గాయాలు ఉన్నాయి. ఈ ఆత్మహత్యల విషయం పోలీసులకు సమాచారం అందించడంతో.. ఆసుపత్రికి చేరుకున్న వారు అంజలి మెడ మీది గాయాన్ని చూసి అది మహేశ్వరి చేసి ఉంటుందని అనుమానించారు. 

మహేశ్వరి పొట్ట, మెడ మీద చిన్నపాటి కత్తిగాట్లు  మాత్రమే ఉన్నాయి. దీంతో మహేశ్వరే అంజలిని చంపి.. ఆత్మహత్య పేరుతో నమ్మించేందుకు ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. అంజలి మృతి చెందడంతో ఆమె చనిపోవడానికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గురువారం నాడు ఆందోళనకు దిగారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహేశ్వరి, శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios