మంచిర్యాల జిల్లాలో ఇద్దరు యువతులపై దాడి, ఒకరి మృతి...!
మంచిర్యాలలో ఇద్దరు యువతుల మీద దాడి జరిగింది. దీంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
మంచిర్యాల : తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అంజలి, మహేశ్వరి అనే ఇద్దరు యువతులపై దాడి జరిగింది. ఇందులో అంజలి మృతి చెందగా, మహేశ్వరి గాయాల పాలైంది. అయితే యువతుల గొంతు కోసి ఉండడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యువతులు ఆత్మహత్యాయత్నం చేశారా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.