సైబర్ నేరగాళ్లు పెద్ద ఫ్రాడ్ కు తెరలేపారు. ఏకంగా క్రిప్టో ట్రేడర్ అకౌంట్ నే హ్యాక్ చేశారు. కోట్ల విలువైన కరెన్సీ ఆ అకౌంట్ లో ఉంది. దీంట్లో రూ.92లక్షల రూపాయలు వివిధ ఖాతాల్లోకి మళ్లింపులు జరిగాయి. 

సైబర్ నేరగాళ్లు పెద్ద ఫ్రాడ్ కు తెరలేపారు. ఏకంగా క్రిప్టో ట్రేడర్ అకౌంట్ నే హ్యాక్ చేశారు. కోట్ల విలువైన కరెన్సీ ఆ అకౌంట్ లో ఉంది. దీంట్లో రూ.92లక్షల రూపాయలు వివిధ ఖాతాల్లోకి మళ్లింపులు జరిగాయి. 

హిమాయత్ నగర్ : cryptocurrency చేసే Trader account హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. అకౌంట్ లో ఉన్న రూ. 2 కోట్లతో సుమారు 90 లక్షలకు పైగా సొమ్మును వారి వారి ఖాతాల్లోకి మళ్లించారు. ఇది గమనించిన Jubileehillsకు చెందిన ఉషారాణి బుధవారం City Cybercrime ఏషీపీ కేవీఎం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. ఐటీ రంగానికి చెందిన ఉషారాణి కొన్నేళ్లుగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నారు.క్రిప్టో కరెన్సీకి చెందిన బి నాన్స్ లో ఈమెకు అకౌంట్ కూడా ఉంది. ఆ అకౌంట్ లో రూ. కోట్లు విలువ గల కరెన్సీ ఉంది.

ఇటీవల ఉషారాణి అకౌంట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. యూఎస్ డీ కింద ఉన్న కరెన్సీ (1.22 లక్షలు) ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.92 లక్షలను మనదేశ కరెన్సీ కింద కన్వెర్ట్ చేసి వివిధ అకౌంట్ లకు బదిలీ చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మహిళ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.

ఎస్ బీఐ ఖాతా నుంచి...
తన అకౌంట్ ను హ్యాక్ చేసి డబ్బు కాజేశారంటూ జూబ్లీహిల్స్ కు చెందిన ఓ వ్యక్తి బుధవారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. సదరు వ్యక్తి కొంతకాలంగా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు. అతనికి జూబ్లీహిల్స్ లోని ఎస్ బీఐలో ఖాతా ఉంది. ఈ ఖాతా ద్వారానే తన లావాదేవీలన్నీ జరుగుతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి ఆయనకు కాల్ చేసి ఎస్ బీఐ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. 

మీ అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పి నమ్మించాడు. ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్ చేయించి, పాస్ వర్డ్ తెలుసుకున్నాడు. అనంతరం తన ఖాతా నుంచి రూ.13.84 లక్షలను వేరే అకౌంట్ కు బదిలీ చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.