హైద్రాబాద్ నగరంలోని బహదూర్ పల్లిలో  ఓ వ్యక్తిని  దుండగులు  అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతదేహన్ని పెట్రోల్ పోసి కాల్చి వేశారు.  

హైదరాబాద్: నగరంలోని బహదూర్‌పల్లి సాయినాథ్ సోసైటీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని గుర్తుపట్టకుండా ఉండేందుకు గాను పెట్రోల్ పోసి దగ్దం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు ఎవరనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.