దుండిగల్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు..
హైదరాబాద్ నగర శివార్లలోని దుండిగల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ డీసీఎం దుండిగల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.

హైదరాబాద్ నగర శివార్లలోని దుండిగల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ డీసీఎం దుండిగల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 11 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. బాధితులు గౌడవెల్లి నుంచి హైదరాబాద్లోని ఎన్టీఆర్ గార్డెన్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన డీసీఎంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తునట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.