16 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- నోట్లరద్దు, క్యాష్ లెస్ లావాదేవీలపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో నోట్ల రద్దు అంశం, నగదు రహిత లావాదేవీలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
మరోవైపు ప్రతిపక్షాలు.. ఫీజు రియింబర్స్ మెంట్, సీఎం నూతన గృహానికి చేసిన ఖర్చు, బలవంతపు భూసేకరణ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి.
దీంతో ఈ సారి శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది.
అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది.