వరంగల్ లో నిర్వహించే పార్టీ సభను విజయవంతం చేసే దిశగా మందు వేస్తూనే ప్రణాళికలు రచిస్తున్నారు.

అసలే అధికార పార్టీ... ఆ పైన 16 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణం... మండుటెండల్లో గులాబీ కూలి దినాల్లో భాగంగా ఇన్ని రోజులు టీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేసి అలిసిపోయి ఉంటారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అందుకే మహబూబ్ నగర్ జిల్లా దేవకద్ర నియోజకవర్గానికి చెందిన గులాబీ కార్యకర్తలు ఇలా బీర్లు తాగుతూ భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు.

ఓరుగల్లు లో నిర్వహించే పార్టీ సభను విజయవంతం చేసే దిశగా మందు వేస్తూనే ప్రణాళికలు రచిస్తున్నారు. పనిలో పనిగా రాష్ట్ర ఖజానాకు, అబ్కారీ శాఖకు తమవంతుగా అండగా నిలుస్తున్నారు.