సారాంశం

తల్లిదండ్రులతో పాటు నిద్రిస్తున్న ఓ బాలుడిపై రెండు పాములు పడ్డాయి. పలుమార్లు కాటేశాయి. దీంతో బాలుడు ఏడుపు మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అక్కడ చికిత్స పొందుతూనే చనిపోయాడు. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొన్ని చోట్ల బ్రిడ్జిలు ధ్వంసం కాగా.. మరి కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. వీటితో ప్రాణనష్టం కూడా జరిగింది. నిజామాబాద్ లో ఓ ఇళ్లు కూలిపోవడం పరోక్షంగా ఓ ప్రాణం పోయేందుకు కారణమైంది. వానలతో ఓ ఇంట్లో గది కూలిపోవడంతో ఆ కుటుంబం వేరే చోట నిద్రించింది. ఆ సమయంలో పైనుంచి రెండు పాములు నిద్రిస్తున్న బాలుడిపై పడి కాటేశాయి. అయితే బాలుడికి వెంటనే చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

32 ఏళ్ల నాటి కేసులో సంచలన తీర్పు .. దోషికి 383 ఏండ్ల జైలు శిక్ష.. రూ.3.2 కోట్ల జరిమానా..

ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేట మండలం బినోల గ్రామంలో మంగలి భూమేశ్‌ తన భార్య హర్షిత ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఇద్దరు పిల్లల్లో పెద్ద కుమారుడు రుద్రాన్ష్ కు రెండున్నరేళ్ల వయస్సు ఉండగా.. కూతురుకు మూడు నెలల వయస్సు ఉంటుంది.

భద్రత వైఫల్యం.. గవర్నర్ కాన్వాయ్‌ పైకి దూసుకొచ్చిన కారు.. ఇద్దరి అరెస్టు

కాగా.. కొన్ని రోజుల కిందట వర్షం పడటంతో ఆ కుటుంబం నివసిస్తున్న ఇంట్లో ఓ రూమ్ కూలిపోయింది. దీంతో భూమేష్ దంపతులు తమ పిల్లలను తీసుకొని మరో రూమ్ లో నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి ప్రాంతంలో ఓ రెండు పాములు ఇంటి పై నుంచి రుద్రాన్ష్ పై పడ్డాయి. ఈ విషయం నిద్రలో ఉన్న తల్లిదండ్రులకు తెలియలేదు. కాగా.. పాములు ఆ బాలుడిని పలుమార్లు కరిచాయి. దీంతో రుద్రాన్ష్ ఏడుపు మొదలుపెట్టడంతో తల్లిదండ్రులు నిద్రలో నుంచి లేచారు.

బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్యకు తీవ్ర అస్వస్థత, హాస్పిటల్‌లో చేరిక.. ‘కండీషన్ క్రిటికల్’

అక్కడ కనిపించిన దృష్యాలు చూసి ఒక్క సారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని ముందుగా ఆ పాములను బయటకు లాగేసి, వాటిని హతమార్చారు. అనంతరం హాస్పిటల్ కు చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో బాలుడు శనివారం ఉదయం కన్నుమూశాడు. అభం శుభం తెలియని రెండున్నరేళ్ల బాలుడు మరణించడంతో తల్లిదండ్రుల, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.