మునుగోడు ఉప ఎన్నికల బరిలో తెలంగాణ జన సమితి నుంచి అభ్యర్థి బరిలో ఉంటారని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఒక వేళ ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్ ను నిలబెడితే ఆయనకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. 

మునుగోడులో ప్ర‌తిప‌క్షాలు ఉమ్మడి అభ్య‌ర్థిగా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ ను నిల‌బెడితే ఆయ‌న‌కు టీజేఎస్ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ప్రొఫెసర్ కోదండ‌రామ్ అన్నారు. లేక‌పోతే ఈ ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ నుంచి వేరే అభ్య‌ర్థి పోటీలో ఉంటార‌ని ఆయ‌న తెలిపారు. హైద‌రాబాద్ లో శుక్రవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 

పాకిస్థాన్ బోటులో వంద‌ల కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం.. ఆరుగురి అరెస్ట్

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చేస్తున్న దుర్మార్గాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం కేసీఆర్ ప్ర‌యత్నిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు భారీగా ఆస్తులు కూడబెట్టారని అన్నారు. వారికి తగిన గుణపాఠం చెప్పే అవకాశం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్ గా మార్చి తన అవినీతి ఒప్పందాల నుండి దృష్టిని మళ్లిస్తున్నారని ఆయ‌న తీవ్రంగా ఆరోపించారు. 

కూతురి సమాధి వద్ద జన్మదిన వేడుకలు.. కంటతడి పెట్టిస్తున్న తల్లి ఆవేదన..

సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ వివిధ రాష్ట్రాల్లో ప్రజల ఆదరణ పొందాలని చూస్తున్నారని, అయితే టీజేఎస్ మాత్రం టీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపుతుందని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు క‌నీస అవ‌స‌రాలు అందించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం అయ్యింద‌ని, ఉద్యోగులు నెల మొదటి రోజు జీతాలు పొందలేకపోతున్నారని కోదండ‌రామ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

మాదాపూర్‌‌లో కారు బీభత్సం.. వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టడంతో..

కేజీ టు పీజీ ఉచిత విద్య, డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు ఎకరాల భూమి వంటి అనేక అంశాల్లో ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. కేసీఆర్ త‌న తక్షణ ప్రయోజనాల కోసం అత్యాశతో, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని అన్నారు. కేసీఆర్ ఉద్య‌మ ప్రయత్నాల నుంచి తప్పుకోడానికి ప్రయత్నించినప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కాపాడుకున్నామ‌ని ఆయ‌న అన్నారు.

పాతబస్తీలో గంజాయి మత్తులో యువకుడి వీరంగం.. పట్టుకుని చితకబాదిన స్థానికులు..

టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై టీజేఏ ఎప్పటికప్పుడు నోట్స్‌ విడుదల చేస్తుందని కోదండ‌రామ్ అన్నారు. పార్టీ పేరు నుంచి తెలంగాణను పక్కనపెట్టి ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నార‌ని తెలిపారు.