ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. డీఏను పెంచుతూ అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం శుభవార్తను ప్రకటించింది. డీఏ (Dearness Allowance)ను 3.64 శాతం పెంచుతూ అధికారికంగా జీవో విడుదల చేసింది. ఈ పెంపు 2023 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జనవరి 2023 నుంచి అమల్లోకి డీఏ పెంపు

ఈ తాజా నిర్ణయం ప్రకారం, ఉద్యోగుల డీఏను 3.64 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏని 2023 నుంచి వర్తింపజేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది లక్షల మంది ఉద్యోగులకు ఎంతో మేలు చేయ‌నుంది.

ఇటీవల తెలంగాణ మంత్రిమండలి రెండు డీఏల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం, ఇప్పుడొక డీఏను విడుదల చేయగా, మరో డీఏను ఆరు నెలల వ్యవధిలో అందజేయనుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు తోడ్పడే నిర్ణయంగా భావిస్తున్నారు.

తాజా డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పెరిగిన జీవన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం, ఉద్యోగులకు ఉపశమనం కలిగించనుంది.