Hyderabad: తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతాయ‌ని ప్రాంతీయ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి పెరిగాయనీ, కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగాయని  రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

india meteorological department: దేశంలోని చాలా ప్రాంతాల‌తో పాటు తెలంగాణ‌లోనూ ఎండలు మండిప‌తున్నాయి. ఎండలు, వేడి గాలుల తీవ్ర‌త పెర‌గ‌డంతో ఉష్ణోగ్ర‌త‌లు సైతం క్ర‌మంగా పైపైకి చేరుతున్నాయి. తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) ప్రాంతీయ కార్యాల‌యం పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతాయ‌ని తెలిపింది. గత 24 గంటల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి పెరిగాయనీ, కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగాయని స‌మాచారం.

వాతావ‌ర‌ణ నివేదిక‌ల ప్ర‌కారం.. రానున్న రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పైగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా, ఉత్తరాదిలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో గత 24 గంటల్లో అత్యధికంగా 37 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.

గత 24 గంటల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని వాతావ‌ర‌ణ నివేదిక‌లు పేర్కొన్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలోని ప‌లు ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి కేరళ, దక్షిణ ఛత్తీస్ గఢ్ వైపు, దక్షిణ తమిళనాడు వైపు మళ్లింది. ద్రోణి తరలింపు కారణంగా రానున్న 5 రోజుల్లో పొడి వాతావరణం నెలకొంటుందని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. రాజస్థాన్, ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా మధ్య భారతం, తెలంగాణలోని ఉత్తర ప్రాంతం నుంచి పొడి గాలులు వీస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర భాగంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని స‌మాచారం.

ఈ పొడి గాలుల కారణంగా ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మాచర్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లోని తూర్పు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. ఈ జిల్లాల్లో 2-4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో 2-3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండ‌టంతో పాటు రాబోయే 48 గంటల్లో ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐదో రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ నివేదిక‌లు పేర్కొంటున్నాయి.