సారాంశం

యూట్యూబ్ వీడియోలు చూసి, అందులో ఉన్నట్టుగా చేసి ఆరో తరగతి చదివే ఓ బాలుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. 
 

మన నిత్య జీవితంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియాలో భాగంగా ఉన్న యూట్యూబ్ ఎక్కువ మంది జనాలను ఆకర్షిస్తోంది. నిత్యం ఇందులో లక్షల సంఖ్యలో వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. ఇందులో అనేక రకాల వీడియోలు లభిస్తున్నాయి. ఇందులో అందరి అభిరుచికి తగిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ యూట్యూబ్ ను అనేక మంది అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. కొందరు యూట్యూబ్ ను జీవనాధారంగా చేసుకొని కంటెంట్ అప్ లోడ్ చేస్తుంటే.. మరి కొందరు అందులోని కంటెంట్ ను ఉపయోగించి నాలెడ్జ్ , స్కిల్స్ పెంచుకుంటున్నారు. ఇంకొందరు సరదాగా వాటిని చూస్తూ గడిపేస్తున్నారు. 

మంచినీరు అని భావించి యాసిడ్ తాగిన కార్మికురాలు.. తరువాత ఏమైందంటే ?

అయితే కొందరు ఆ వీడియోల్లో చెప్పిన విధంగా చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల జార్ఖండ్ లో ఓ యువకుడు పంటి నొప్పి తగ్గేందుకు యూట్యూబ్ లో చెప్పిన విధంగా  కెనెర్ (ఒలియాండర్) విత్తనాలను తిన్నాడు. అవి విషపూరితమైనవి కావడంతో పరిస్థితి విషమించి చనిపోయాడు. తాజాగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ బాలుడు యూట్యూబ్ లో చెప్పినట్టు చేసి ప్రాణాలను కోల్పోయాడు. 

పులి వచ్చినా బెదరని గేదెలు.. ఐకమత్యంతో, గుంపుగా వెళ్లి దానిపైనే దాడి.. గాయాలతో క్రూర మృగం మృతి.. వీడియో వైరల్

బాధిత కుటుంబం, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్ తండాలో ప్రశాంత్, వనిత అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు 11 ఏళ్ల ఉదయ్ ఆరో తరగతి చదువుతున్నాడు. ఇప్పటి పిల్లల మాదిరిగానే ఆ బాలుడు కూడా కుటుంబ సభ్యుల ఫోన్లలో యూట్యూబ్ చూసేవాడు. అందులో సరదా సీన్స్ ను ఎక్కువగా చూస్తూ గడిపేవాడు.

అందరికీ ఫిట్ నెస్ జాగ్రత్తలు చెప్పే ట్రైనర్.. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ, మెడ విరిగి మృతి.. వీడియో వైరల్

ఎప్పటిలాగే శనివారం కూడా రాత్రి భోజనం ముగిసిన తరువాత యూట్యూబ్ చూస్తున్నాడు. అయితే ఈ సారి ఓ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బాలుడిని పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే తలుపు పగుల గొట్టి లోపలికి వెళ్లారు. అయితే అక్కడ కనిపించిన దృష్యాన్ని చూసి ఒక్క సారి షాక్ అయ్యారు. ఉదయ్ లుంగీతో ఓ మేకుకు ఉరి వేసుకున్న స్థితిలో ఉన్నాడు. అప్పటికి బాలుడికి కొన ఊపిరి ఉంది. వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే బాలుడు మరణించాడని డాక్టర్లు తెలిపారు.