Asianet News TeluguAsianet News Telugu

రేవంత్, భట్టిలపై అసంతృప్తి.. జూమ్ మీటింగ్‌కు డుమ్మా కొట్టిన జగ్గారెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి సాయంత్రం టీ.కాంగ్రెస్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. అంతకుముందే జగ్గారెడ్డికి ఫోన్ చేశారు ఏఐసీసీ కార్యదర్శి జావెద్.

sangareddy mla jagga reddy absent for tpcc zoom meeting
Author
First Published Nov 19, 2022, 6:25 PM IST

టీ.కాంగ్రెస్ జూమ్ మీటింగ్‌కు డుమ్మా కొట్టారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.  ఉదయం టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. దీనిపై ఆయనకు ఫోన్ చేశారు ఏఐసీసీ కార్యదర్శి జావెద్. పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడటానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలదేనన్న వ్యాఖ్యలపై జావెద్ వివరణ కోరినట్లు సమాచారం. మరోవైపు.. ఈ జూమ్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది టీ.కాంగ్రెస్. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటు బీజేపీ, టీఆర్ఎస్ విధానాలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎల్లుండి నుంచి డిసెంబర్ 5 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లుగా సమాచారం.  మండల కేంద్రాలు, కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించారు. 

ఇకపోతే.. తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణను రూపొందించేందుకు పార్టీ నాయకత్వం ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. అయితే నేరుగా సమావేశం పెట్టకుండా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఈ రోజు మహేష్ గౌడ్ తనకు ఫోన్ చేశారని చెప్పారు. జూమ్ మీటింగ్ ఉందని చెప్పారని.. అయితే అలా చెప్పగానే తనకు కోపం వచ్చిందని అన్నారు. 

Also REad:పార్టీలో ఇబ్బంది ఉంది.. రేవంత్ రెడ్డి పీసీసీ హోదా మరిచి మాట్లాడుతున్నారు: జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

పీసీసీ, సీఎల్పీ సమన్వయం చేయాలని సూచించారు. తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ఇదేమైనా ఐటీ కంపెనీలా.. ఇళ్లలో కూర్చొని మాట్లాడుకోవడానికి అని ప్రశ్నించారు. జూమ్ మీటింగ్ పద్దతి మంచిది కాదన్నారు. ఇలా అయితే కష్టమని చెప్పారు. పీసీపీ అధ్యక్షుడిది కూడా తప్పేనని విమర్శించారు. వారం, పది రోజులకోకసారి మీటింగ్ అని చెప్పారని.. అసలు మీటింగులే పెట్టడం లేదని అన్నారు. అందరూ గాంధీ భవన్‌లో కూర్చొని చర్చించాలని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో ఉన్న పది మంది కూడా కూర్చొలేని పరిస్థితి ఉందన్నారు. దీనికి తాను కూడా బాధ్యుడినేనని చెప్పారు. భవిష్యత్తులో పీసీసీ అవకాశం ఇస్తే.. అన్ని చేస్తానని తెలిపారు. తనకు పీసీసీ అవకాశం ఇస్తే తన దగ్గర మెడిసిన్ ఉందని చెప్పారు. ఎన్నికల ముందు పీసీసీని మార్చమని తాను చెప్పడం లేదన్నారు. మీడియాలో వచ్చినట్టుగా మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే  కాంగ్రెస్‌కు నష్టమేనని చెప్పారు. దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కదేనని తెలిపారు. పాదయాత్రలో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్‌ షో చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆయన ఒక్కడే పనిచేస్తున్నానని బిల్డప్ ఇచ్చారని ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమికి రేవంత్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. 

ఓటర్లకు డబ్బులిచ్చి చెడగొట్టింది రాజకీయ పార్టీలేనని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన జగ్గారెడ్డి.. 50 కోట్లు ఇచ్చిన వ్యక్తికి రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. పాల్వాయి స్రవంతికి ఆమె తండ్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి పేరుతో టికెట్ వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి పీసీసీ హోదా మరిచిపోయి టీవీల్లో మాట్లాడుతున్నారని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios