టీఎస్‌పీఎస్‌సీ  నిర్వహించిన  గ్రూప్-1   ప్రిలిమ్స్ పరీక్షా ప్రశ్నాపత్రం  లీకైందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం కూడా లీకైందా అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి సారించారు. గ్రూప్-1 పరీక్షను కూడా ప్రవీణ్ రాశాడు. కానీ ఈ పరీక్షకు ప్రవీణ్ క్వాలిఫై కాలేదు. కానీ ఈ పరీక్షలో ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చాయి. టీఎస్‌పీఎస్‌సీలో పనిచేస్తూ గ్రూప్ -1 పరీక్ష రాసిన ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చిన ఎందుకు క్వాలిఫై కాలేదని పోలీసులు ఆరా తీశారు. టీఎస్‌పీఎస్‌సీ నిబంధనలకు విరుద్దంగా ఆన్సర్ షీట్ లో ప్రవీణ్ తప్పుగా వ్యవహరించినట్టుగా గుర్తించారు. దీంతో ప్రవీణ్ క్వాలిఫై కాలేదు. 150 మార్కుల పేపర్ లో 103 మార్కులు వచ్చినా ప్రవీణ్ క్వాలిఫై కాలేదు.ఆన్సర్ షీట్ బబ్లింగ్ లో పొరపాటు చేసినందున ప్రవీణ్ న ప్రవీణ్ క్వాలిఫై చేయలేదు.

గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షల సమయంలో కూడా ఇప్పటి మాదిరిగానే పేపర్ ను ముందుగానే ప్రవీణ్ తెలుసుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై వాస్తవాలను తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ ఉపయోగించిన ఫోన్ ను ఎఫ్ఎస్‌ఎల్ కు పంపారు.

2022 అక్టోబర్ 16వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించారు.ఈ ఏడాది జనవరి 13వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. 2.60 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షలు రాశారు. వీరిలో సుమారు 26 వేల మంది క్వాలిఫై అయ్యారు. 

also read:ప్రశ్నాపత్రం లీక్: టీఎస్‌పీఎస్‌సీ వద్ద బీజేవైఎం ఆందోళన, ఉద్రిక్తత

ఈ ఏడాది జూన్ 5 నుండి 12వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఒకవేళ గ్రూప్-1 పేపర్ ప్రశ్నాపత్రం కూడా లీకైతే ఈ పరీక్ష రాసి క్వాలిఫై అయిన అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. 

ఈ నెల 12, 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన రెండు పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. ఈ నెల 12న టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్ష, ఈ నెల 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామాకాలపై పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలకు సంబందించిన ప్రశ్నా పత్రాల లీకేజీపై సమాచారం రావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్టుగా పోలీసులు గుర్తించారు. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పరీక్షల పేపర్లు లీకయ్యాయో లేదో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.