కేసిఆర్... క్షమాపణ చెప్పు
- సైన్స్ కాంగ్రెస్ తరలింపు అన్యాయం
- ఓయుపై కక్షపూరితంగా వ్యవహరించిన కేసిఆర్
- బహిరంగ క్షమాపణలు చెప్పాలి
సైన్స్ కాంగ్రెస్ సదస్సు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో జరగకుండా తరలిపోవడం వెనుక సిఎం కేసిఆర్ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతల పేరుతో కేసిఆర్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు జరగకుండా వాయిదా వేయించారని మండిపడ్డారు. తక్షణమే సిఎం కేసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ, రాష్ట్ర ప్రతిష్టతను పెంచేలా సదస్సు జరపకుండా ఉస్మానియా విద్యార్థులపై కక్ష సాధించారని మండిపడ్డారు.
మరిన్ని అంశాలు ఈ కింది వీడియోలో చూడండి.