ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపిన రామ్ నాథ్ కోవింద్ కు టిఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఆ పార్టీ అధినేత కెసిఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మద్దతు కోరారు. దీనికి సిఎం అంగీకరించారు. దళితుడిని రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కెసిఆర్.

ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపిన రామ్ నాథ్ కోవింద్ కు టిఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఆ పార్టీ అధినేత కెసిఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మద్దతు కోరారు. దీనికి సిఎం అంగీకరించారు. దళితుడిని రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కెసిఆర్.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి సూత్ర్రపాయంగా టిఆర్ఎస్ మద్దతు ఇస్తామని పేర్కొంది. అయితే ఇప్పటివరకు ఎన్డీఏ అభ్యర్థి పేరును ప్రకటించలేదు.

తాజాగా అభ్యర్థిని ప్రకటించడంతో ఇప్పటికే అనుకూల నిర్ణయం తీసుకున్న టిఆర్ఎస్ ఎన్టీఏ అభ్యర్థికి తాము మద్దతిస్తామని ప్రకటించారు. కెసిఆర్ కు ప్రధాని ఫోన్ చేసిన విషయాన్ని మంత్రి కెటిఆర్ ట్విటర్ లో పేర్కొన్నారు.

Scroll to load tweet…