Asianet News TeluguAsianet News Telugu

భార్గవ్ రామ్ ఎక్కడ: ఇంటికి తాళం వేసి గుంటూరు శ్రీను తల్లిదండ్రులు మాయం

టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం తెలంగాణ పోలీసులు పూణే, బెంగళూరుల్లో గాలిస్తున్నారు. గుంటూరు శ్రీను కోసం మరో బృందం వేట సాగిస్తోంది.

Police search for Bhuma Akhilapriya husband Bhargavram
Author
Hyderabad, First Published Jan 10, 2021, 8:21 AM IST

హైదరాబాద్: ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో పోలీసులు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం గాలిస్తున్నారు. రెండు బృందాలతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భార్గవ్ రామ్ బెంగళూరులో గానీ పూణేలో గానీ తలదాచుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

కిడ్నాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మాదాల శ్రీనివాస చౌదరి అలియాస్ గుంటూరు శ్రీను కోసం మరో పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు, కిడ్నాప్ నకు వాడిన కార్లను పోలీసులు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.

Also Read: అఖిలప్రియకు అర్థరాత్రి వైద్య పరీక్షలు: రహస్యంగా తరలించిన అధికారులు

గత నాలుగు రోజులుగా గుంటూరు శ్రీను తల్లిదండ్రులు కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. గుంటూరులోని తమ ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారని సమాచారం. శ్రీను కోసం తెలంగాణ పోలీసులు గుంటూరుకు వచ్చారా అని అడిగితే తమకు సమాచారం లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. గుంటూరు శ్రీను కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచాఫ్ లో ఉన్నాయి.

Also Read: అఖిలప్రియను వారంరోజుల కస్టడీకి ఇవ్వండి : కోర్టులో పిటిషన్

ఇంజనీరింగ్ లో గుంటూరు శ్రీనుకు తెలుగు యువత నాయకుడు రాయపాటి సాయికృష్ణ మిత్రుడని తెలుస్తోంది. రాయపాటి సాయికృష్ణ ద్వారా గుంటూరు శ్రీను అఖిలప్రియకు పరిచయమయ్యాడు. భూమా కుటుంబానికి గుంటూరు విద్యానగర్ లో ఓ ఇల్లు ఉంది. దాన్ని మంత్రిగా ఉన్న్పపుడు అఖిలప్రియ కార్యాలయంగా వాడేవారు. ఈ క్రమంలో ఆ ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ బాధ్యతలను గుంటూరు శ్రీను తీసుకున్నాడు. తద్వారా అఖిలప్రియ కుటుంబానికి అతను దగ్గరయ్యాడు. 

అఖిలప్రియ, భార్గవ్ రామ్ ల వివాహం జరిగిన తర్వాత అతను భార్గవ్ రామ్ కు మరింత చేరువయ్యాడు. ఆయనకు ఆంతరింగిక వ్యక్తిగా మారాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా కుటుంబంలో ఒక్కడిగా గుంటూరు శ్రీను కీలకంగా వ్యవహరించాడు. 

టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగా కిరాయి హంతకులకు రూ. 50 లక్షలు అందించింది కూడా గుంటూరు శ్రీనుయేనని అప్పట్లో పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో అరెస్టయిన శ్రీను మూడు నెలల పాటు జైలులో ఉండి ఆ తర్వాత విడుదలయ్యాడు. అఖిలప్రియ మంత్రిగా ఉన్న కాలంలో ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాల్లో పలు రోడ్డు కాంట్రాక్టులు చేశాడు. 

హఫీజ్ పేట కిడ్నాప్ వ్యవహారాన్ని గుంటూరు శ్రీను సినీ ఫక్కీలో నడిపినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాదులోని శ్రీనగర్ ప్రాంతంలోని ఓ సినీ ఆర్టిస్ట్ కంపెనీ నుంచి ఐటి అధికారులు, పోలీసులకు సంబంధించిన డ్రెస్సులు అద్దెకు తీసుకున్నాడు. 

ఆ తర్వాత సినీ శిక్షకుడిగా వద్ద మూడు రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. పక్కాగా కిడ్నాప్ వ్యవహారాన్ని గుంటూరు శ్రీను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీను వ్యవహారంపై ఏపీ పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios