ఆస్మా బేగం శరీరంలో బుల్లెట్: తెరపైకి జుబేర్ కాల్పుల కేసు
ఆస్మా బేగం కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆస్మా బేగం తండ్రి పనిచేస్తున్న ఫంక్షన్ హాల్ యజమాని కొడుకు జుబేర్ పై గతంలో ఉన్న కేసు విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్: ఆస్మా బేగం కేసులో కొన్ని సంచలన విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్మా బేగం కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Also read: ఆస్మా వెన్నులో బుల్లెట్: సంచలన విషయాలు
వెన్నుముక నొప్పితో ఉన్న ఆస్మా బేగం శరీరం నుండి బుల్లెట్ నుండి నిమ్స్ వైద్యులు ఈ నెల 21వ తేదీన బుల్లెట్ను వెలికి తీశారు.ఆస్మా బేగం తండ్రి కింగ్స్ పంక్షన్ హాల్ లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. కింగ్స్ ఫంక్షన్ హాల్ యజమాని కొడుకు జుబేర్ గతంలో ఓ పెళ్లి బరాత్ సమయంలో కాల్పులు జరిపాడు.
ప్రస్తుతం ఈ కేసు కూడ పోలీసుల దృష్టికి వచ్చింది. రెండున్నర ఏళ్లుగా ఆస్మా బేగం కుటుంబసభ్యులు ఈ విషయమై ఎందుకు పోలీసులకు చెప్పలేదని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also read:వెన్నునొప్పి ఆపరేషన్ చేస్తే బుల్లెట్ దొరికింది
ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆస్మా బేగం శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నారు. జుబేర్ గతంలో పెళ్లి వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని కాల్పులు జరిపాడు.
ఆ సమయంలో ఈ ఘటన పెద్ద సంచలనమే. దీంతో అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఆస్మాబేగం కాల్పుల వ్యవహరాం వెలుగు చూడడంతో జుబేర్ కాల్పుల కేసును కూడ మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.