హైదరాబాద్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం.. హాజరైన ఏపీ, తెలంగాణ అధికారులు..
హైదరాబాద్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ అయింది. నగరంలోని కృష్ణా గోదావరి భవన్లోని ఈ సమావేశం జరుగుతుంది.
హైదరాబాద్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ అయింది. నగరంలోని కృష్ణా గోదావరి భవన్లోని ఈ సమావేశం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీసీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు, జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు. కేంద్ర జల సంఘం ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్లో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీని(పీపీఏ) కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనపై ఈ సమావేశం చర్చించనున్నారు. అలాగే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై కూడా చర్చించనున్నారు.