హైదరాబాద్ ఘట్కేసర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుందనీ.. తరగతులు నిర్వహించకున్నా.. ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తుందని..ఓ విద్యార్థి తండ్రి తన గోడును సోషల్ మీడియా ట్విటర్ వేదికగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు వెల్లబుచ్చుకున్నాడు. సదరు విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. పాఠశాలలు పనిచేయకున్నా.. విద్యార్థులకు తరగతులు నిర్వహించకున్నా యాజమాన్యాలు ఫీజులను వసూలు చేస్తున్నాయి. పాఠశాలల యాజమాన్యాలు వార్షిక ఫీజులను కాకుండా, కేవలం నెలవారీ ట్యూషన్ ఫీజులను మాత్రమే వసూలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. కానీ, పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పేరున్న పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ బలవంతంగా వసూలు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.
లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ తరుగతులు నిర్వహించినప్పుడు..ఫీజు కడుతారా.. లేదంటే ఆన్లైన్ క్లాసుల లింక్ కట్ చేయమంటారా.. అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రవేట్ స్కూల్స్ యాజమాన్యాలు హెచ్చరించినట్టు ఆరోపణలున్నాయి. కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు.. తాము చెప్పిన చోటే పుస్తకాలు కొనాలని, షరతులు విధించడం లేదంటే పాఠశాలలోనే బిల్లు చెల్లించాలని కరాఖండిగా చెప్పారని విమర్శలున్నాయి. గత నెలరోజుల నుంచి ఫీజుల వసూళ్లపై కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు దృష్టి సారించారు. మెస్సెజ్లు పెడుతూ, నేరుగా ఫోన్లో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో .. హైదరాబాద్ ఘట్కేసర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుందనీ.. తరగతులు నిర్వహించకున్నా.. ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తుందని, అంతే కాకుండా సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ విద్యార్థి తండ్రి తన గోడును సోషల్ మీడియా ట్విటర్ వేదికగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు వెల్లబుచ్చుకున్నాడు. సదరు విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఓ విద్యార్థి తండ్రి తన ట్విటర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. "గౌరవనీయులైన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారికి మా విన్నపం. ఘట్కేసర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో యాజమాన్యం వేధింపులు ఎక్కువుతున్నాయి. కోవిడ్-19 వల్ల గత రెండు సంవత్సరాలుగా స్కూల్లో ఎటువంటి తరగతులు జరగలేదు. ఇటీవల తెరుచుకున్న ఈ స్కూల్లో ఫీజుల విషయంపై విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల తీవ్రమైన ఒత్తిడి తీసుకవస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ తరుగతులు నిర్వహించినప్పుడు కూడా మేమంతా ఫీజులు చెల్లించాము. కానీ మొత్తం ఫీజు కడితేనే విద్యార్థులను పరీక్షలు రాయడానికి అనుమతి ఇస్తామంటున్నారు. లేకపోతే విద్యార్థులను పరీక్షలు రాయడానికి అనుమతి లేదని దౌర్జన్యం చేస్తున్నారు. ఎంత బతిమిలాడిన స్కూల్ యాజమాన్యం మా మాట వినడం లేదు. దయచేసి మీరు ఈ విషయంపై తప్పకుండా స్పందించి మా న్యాయం చేయండి సార్.." అంటూ తన గోడు వెల్లబుచ్చుకున్నాడు.
