Telangana: సమ్మె లేదు.. తెలంగాణలో యథావిధిగా తిరగనున్న బస్సులు
తమ డిమాండ్లపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిగిన చర్చల అనంతరం, తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) కార్మికులు మే 6 మంగళవారం తమ సమ్మెను విరమించారు. హైదరాబాద్లోని మంత్రివాసంలో జరిగిన చర్చల తర్వాత, ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమించనున్నట్లు ప్రకటించాయి.