Asianet News TeluguAsianet News Telugu

మెట్టుగూడా వద్ద రోడ్డు ప్రమాదం.. మెట్రో రైల్ పిల్లర్ ను ఢీ కొట్టిన సిమెంట్ మిక్సర్ లారీ...

హైదరాబాద్ : అర్ధరాత్రి మెట్టుగూడా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ మిక్సర్ లారీ మెట్రో రైల్ పిల్లర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ కు గాయాలయ్యాయి. అర్థరాత్రి జరిగినా లారీని తొలగించకపోవడంతో.. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలకు దిగారు. భారీ క్రేన్ల సాయంతో లారీని తొలగించారు. మెట్టుగూడా నుంచి సికింద్రాబాద్ వైపుకు వెడుతున్న లారీ ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదానికి గల కారణాలేంటో తెలియరాలేదు. 

Midnight accident at mettuguda,heavy traffic jam, hyderabad
Author
Hyderabad, First Published Jan 22, 2022, 9:57 AM IST

హైదరాబాద్ : అర్ధరాత్రి mettuguda వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 
Cement Mixer Lorry మెట్రో రైల్ పిల్లర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ కు గాయాలయ్యాయి. అర్థరాత్రి జరిగినా లారీని తొలగించకపోవడంతో.. ఆ ప్రాంతంలో భారీగా traffic jam ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలకు దిగారు. భారీ క్రేన్ల సాయంతో లారీని తొలగించారు. మెట్టుగూడా నుంచి సికింద్రాబాద్ వైపుకు వెడుతున్న లారీ ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదానికి గల కారణాలేంటో తెలియరాలేదు. 

ఇదిలా ఉండగా, జనవరి 9న హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేపీహెచ్‌బీ కాలనీ వద్ద బైక్‌ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న జగన్ మోహన్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ అక్కడ ఆగకుండా వెళ్లింది. దీంతో బాధితుడి మృతదేహాన్ని టిప్పర్ 20 మీటర్లు ఈడ్చుకెళ్లింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనస్థలానికి చేరుకున్నారు. 

పోస్టుమార్టమ్ నిమిత్తం జగన్ మోహన్‌రెడ్డి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడు జగన్ ‌మోహన్‌రెడ్డి software engineer పనిచేస్తున్నాడు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

ఇదిలా ఉంటే ఎల్బీ నగర్‌లో శనివారం జనవరి 8న అర్ధరాత్రి దాటిన తర్వాత కారు బీభత్సం సృష్టించింది. సాగర్ రింగ్ రోడ్డు వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు.. ఎల్బీ నగర్‌ అండర్ పాస్‌లో బోల్తా కొట్టింది. డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అందులో ఉన్నవారు.. కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న గస్తీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. 

ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డుకు అడ్డంగా బోల్తాపడిన కారును అక్కడి నుంచి తరలించారు. అయితే కారు నడుతుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనా వేస్తు్నారు. కారుపై రూ.13,300 పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.

కాగా, జనవరి 11న హైద‌రాబాదులోని రాజేంద్రన‌గ‌ర్ ఓఆర్ఆర్ పై రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. శంషాబాద్ ప్రాంతం నుంచి హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి వైపు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అతి వేగంగా ఈ ప్ర‌మాదానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

అతివేగంగా, నిర్ల‌క్ష‌మైన డ్రైవింగ్ వ‌ల్ల ఓఆర్ఆర్ ల‌పై త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. గ‌తేదాది నవంబ‌ర్ 22వ తేదీన అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధి కోహెడ వద్ద ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేకుంది. ఇందులో ఇద్ద‌రు త‌ల్లీ కూతుర్లు మృతి చెందారు. మ‌రో ముగ్గురు గాయాల‌ప‌ల‌య్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios