MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Farmers Scheme : తెలుగు రైతులకు బంపర్ ఆఫర్.. అకౌంట్లోకి నేరుగా రూ.30,000, సర్కార్ సూపర్ స్కీమ్

Farmers Scheme : తెలుగు రైతులకు బంపర్ ఆఫర్.. అకౌంట్లోకి నేరుగా రూ.30,000, సర్కార్ సూపర్ స్కీమ్

నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగించింది. ఈ మేరకు రూ.3.15 లక్షల కోట్ల నిధుల కేటాయింపుకు మోదీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 01 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పీఎం కిసాన్ పై బిగ్ అప్ డేట్
Image Credit : AI

పీఎం కిసాన్ పై బిగ్ అప్ డేట్

PM Kisan Scheme : దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల పాలిట వరంగా మారిన 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM-KISAN) పథకాన్ని మరో 5 ఏళ్లు, అంటే 2030-31 వరకు పొడిగిస్తూ కీలక ప్రకటన చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్నదాతలందరికీ భారీ ఆర్థిక సాయం కొనసాగనుంది. 

నిన్న (జూలై 31, శుక్రవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమై ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ మెగా స్కీమ్ కోసం కేంద్రం ఏకంగా రూ.3.15 లక్షల కోట్లు కేటాయించింది. ఈ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దీంతో పాటు 'ప్రధాన మంత్రి సూర్య సరోవర్ యోజన' (PM-SSY) వంటి కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ భారీగా నిధులు కేటాయించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
24 విడత పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి?
Image Credit : Asianet News

24 విడత పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి?

పీఎం కిసాన్ లబ్ధిదారులైన రైతులు ఇప్పుడు 24వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం ఈ పథకాన్ని 5 ఏళ్లు పొడిగించడం రైతులకు పెద్ద ఊరటనిచ్చింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 24వ విడత డబ్బులు అక్టోబర్ నెలలో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని అంచనా. 

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లను నేరుగా నగదు బదిలీ (DBT) ద్వారా రైతుల ఖాతాల్లోకి పంపారు. చివరిగా వచ్చిన 23వ విడతలో దేశవ్యాప్తంగా 9.49 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారు. 24వ విడతలో మరింత ఎక్కువమంది రైతులు లబ్ధి పొందే అవకాశాలున్నాయి.

Related Articles

Related image1
PM Kisan Hike: పీఎం కిసాన్ నిధులు పెరుగుతాయా? 24వ విడత రూ.2000 పొందాలంటే ఈ 3 పనులు వెంటనే చేయండి
Related image2
PM Kisan : మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడలేవా..? అయితే వెంటనే ఈ పని చేయండి
35
పిఎం కిసాన్ తో మహిళా సాధికారత
Image Credit : AI

పిఎం కిసాన్ తో మహిళా సాధికారత

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో మహిళా రైతుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ పథకంలో లబ్ధి పొందుతున్న ప్రతి నలుగురిలో ఒకరు మహిళా రైతు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతకు (women empowerment) ఈ పథకం ఎంతగానో దోహదపడుతోంది. 

కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2030-31 వరకు పొడిగించి రూ.3.15 లక్షల కోట్ల నిధిని కేటాయించడంతో, రాబోయే ఐదేళ్లపాటు రైతులకు సరైన సమయంలో పెట్టుబడి సాయం అందుతుంది. కేంద్రం తీసుకున్న ఈ దీర్ఘకాలిక నిర్ణయం, కష్టాల్లో ఉన్న రైతులకు పెద్ద భరోసా ఇస్తోంది.

45
ఇలాగైతేనే పీఎం కిసాన్ డబ్బులు...
Image Credit : Asianet News

ఇలాగైతేనే పీఎం కిసాన్ డబ్బులు...

పీఎం-కిసాన్ పథకం కింద, అర్హులైన ప్రతి రైతుకు ఏటా రూ.6,000 అందుతుంది. ఈ మొత్తాన్ని ప్రతీ 4 నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున 3 విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి. అలాగే, బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్‌ను లింక్ చేయడం, భూమి వివరాలను సరిచూసుకోవడం కూడా తప్పనిసరి. అన్ని వివరాలు సక్రమంగా ఉంటేనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పెట్టుబడి సాయం అందుతుంది.

55
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
Image Credit : ANI

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

  • పీఎం కిసాన్ పథకం ద్వారా రాబోయే ఐదేళ్లు రైతులకు ఆర్థికసాయం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది మోదీ సర్కార్,
  • పీఎం సూర్య సరోవర్‌ యోజన కోసం రూ.5,070 కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
  • ఖేలో ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్కీమ్‌ కోసం రూ.36,441 కోట్లు కేటాయించాలని మోదీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
  • సముద్ర మంథన్ కార్యక్రమానికి ఏకంగా రూ.84,084 కోట్లు కేటాయించింది కేంద్ర మంత్రివర్గం.
  • క్వీన్ ట్యూబ్ టన్నెల్స్ నిర్మాణం కోసం రూ.9,779 కోట్లు కేటాయించింది. ఇది దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ప్రాజెక్ట్.
  • ఇలా వివిధ పథకాలు, డెవలప్మెంట్ కార్యక్రమాల కోసంమొత్తం రూ.4,50,988 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Flood Alert : ఏపీలో భారీ వర్షాలే లేవు, అయినా పొంచివున్న వరద ముప్పు.. ఈ ప్రాంతాల్లో ఇక అల్లకల్లోలమే
Recommended image2
SIR గడువు మరోసారి పొడిగింపు.. ఓటర్లకు ఈసీ కీలక అవకాశం, చివ‌రి తేదీ ఎప్పుడంటే
Recommended image3
Now Playing
ఆప్త మిత్రుడిని కోల్పోయా పెద్ది మరణంపై కేసీఆర్ ఎమోషనల్ | BRS Leader Peddi Sudarshan Reddy
Related Stories
Recommended image1
PM Kisan Hike: పీఎం కిసాన్ నిధులు పెరుగుతాయా? 24వ విడత రూ.2000 పొందాలంటే ఈ 3 పనులు వెంటనే చేయండి
Recommended image2
PM Kisan : మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడలేవా..? అయితే వెంటనే ఈ పని చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved