పోచంపల్లి చేనేత పార్కును సందర్శించిన కేటీఆర్ చేనేతకు ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని హామీ

చేనేత ఉత్పత్తులకు, చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి కె. టి. రామరావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి టెక్స్ టైల్ పార్క్ ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. చేనేత కార్మికులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్ వద్ద ఉన్న టెక్స్ టైల్ పార్కుని సైతం మంత్రి సందర్శించారు.

చేనేతకు ప్రభుత్వ సహకారం, ప్రత్యేక పాలసీ తీసుకుని వస్తామని తెలిపారు. ఈ దిశగా ప్రయత్నాలు పూర్తి కావడానికి వచ్చాయన్నారు. వ్యవసాయం తర్వతా అధికంగా ప్రజలకు ఉపాది కల్పిస్తున్న రంగం చేనేత రంగమని మంత్రి తెలిపారు.

తెలంగాణ చేనేత కేంద్రాలైన పోచంపల్లి, గద్వాల వంటి ప్రాంతాల చేనేత ఉత్పత్తులకు ప్రపంచంలోనే గుర్తింపు ఉందన్నారు మంత్రి కేటీఆర్. చేనేత ఒక కళ అని, చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. లక్షలాది కుంటుంబాలకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. 2000 వేల మగ్గాలకు గాను 250 మాత్రమే పనిచేస్తున్నాయని, పొచంపల్లి పార్కుని అభివృద్ది చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను కార్మికుల నుంచి అడిగి తెలుసుకున్నామని మంత్రి తెలిపారు.

మెత్తం చేనేత వస్ర్తాల తయరీ ప్రక్రియను క్షుణ్ణంగా అర్దం చేసేకునేందుకే ఇక్కడ పర్యటించానని, ఈ పార్కు పూర్తి స్థాయి సామర్ధ్యంతో పని చేసేందుకు అవసరమైన నిధులు, ప్రభుత్వ పరమైన ఇతర కార్యక్రమాలను చేపడతామని మంత్రి తెలిపారు. చేనేత ఉత్పత్తులకు ఇప్పటికే ఆన్ లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించామని..రానున్న రోజుల్లో దానిని మరింత విస్తృతం చేస్తామని, ఇందుకోసం అన్ని ఈ కామర్స్ వెబ్ సైట్లతో మాట్లాడుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

యాదాద్రితో పాటు దగ్గర మల్కాపూర్ వద్ద జాతీయరహదారిపై పోచంపల్లి చేనేత ఉత్పత్తుల ఔట్ లెట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అటు ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసే హస్తకళల కేంద్రం గోల్కోండలోనూ చేనేత ఉత్పత్తులకు స్థానం కల్పిస్తామన్నారు.