త్రిపుర హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ నియమితులయ్యారు. ఆయన హైదరాబాదీ కావడం గమనార్హం. 

న్యూఢిల్లీ : త్రిపుర హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా జస్టిస్ అమర్నాథ్ గౌడ్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. నవంబర్ 11 నుంచి ఆయన తాత్కాలిక సీజేగా కొనసాగుతారంటూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. జస్టిస్ అమర్నాథ్ 1965లో హైదరాబాద్ లో జన్మించారు. 2017 సెప్టెంబర్ 21న ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 అక్టోబర్ 28న త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred