పంజాగుట్టలో కలకలం.. షాప్ ఎదుట ఐదేళ్ల బాలిక మృతదేహం..
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో (panjagutta) ఐదేళ్ల బాలిక మృతదేహం తీవ్ర కలకలం రేపింది. పంజాగుట్ట ద్వారకాపూరి కాలనీలో బాలిక మృతదేహాన్ని (girl dead body) స్థానికులు గుర్తించారు.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో (panjagutta) ఐదేళ్ల బాలిక మృతదేహం తీవ్ర కలకలం రేపింది. పంజాగుట్ట ద్వారకాపూరి కాలనీలో బాలిక మృతదేహాన్ని (girl dead body) స్థానికులు గుర్తించారు. ఓ షాపు ఎదుట బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలిస్తున్నారు. బాలికది ఎవరైనా హత్య ఇక్కడ పడేవేశారా..?, లేక సాధారణంగా మరణించిందా..?, అసలు బాలిక ఎవరు..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాలిక మృదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఆ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.