గురుకుల మెయిన్స్ వాయిదా కోసం ఓయులో ధర్నా (వీడియో)
గురుకుల మెయిన్స్ పరీక్షకు 90 రోజుల సమయం ఇవ్వాలన్న డిమాండ్ పై అభ్యర్థులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్శిటీలో పెద్దమొత్తంలో విద్యార్థులు ధర్నా చేశారు. ప్రిలిమ్స్ ఫలితాల తర్వాత కేవలం 30 రోజులే సమయం ఇచ్చారని ఆ సమయాన్ని మరో 60 రోజులు పొడిగించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
గురుకుల మెయిన్స్ పరీక్షకు 90 రోజుల సమయం ఇవ్వాలన్న డిమాండ్ పై అభ్యర్థులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్శిటీలో పెద్దమొత్తంలో విద్యార్థులు ధర్నా చేశారు.
ప్రిలిమ్స్ ఫలితాల తర్వాత కేవలం 30 రోజులే సమయం ఇచ్చారని ఆ సమయాన్ని మరో 60 రోజులు పొడిగించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
అభ్యర్థులు ఎక్కువ మంది తెలుగు మీడియం వారే ఉన్నారని, అయినా పుస్తకాలు కూడా లేకుండా పరీక్షలు జరిపితే లాభమేంటని ప్రశ్నించారు. ప్రయివేటు పుస్తకాలు ప్రామాణికం కాదని పేర్కొన్నారు.
టిఎస్సీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాని, గురుకులాల కార్యరద్శి ప్రవీణ్ కుమార్ మొండి మనుషుల మాటలు వినొద్దని ప్రభుత్వానికి నిరుద్యోగ జెఎసి నేత మానవత్ రాయ్ డిమాండ్ చేశారు. తక్షణమే గురుకుల మెయిన్స్ వాయిదా వేయాలన్నారాయన.