రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో కొత్త రకం మోసం వెలుగుచూసింది. జలకన్య కన్ను అంటూ రూ.2 కోట్లకు విక్రయించేందుకు యత్నించారు కేటుగాళ్లు 

ప్రజలను రకరకాల మార్గాల్లో బురిడీ కొట్టించి అందినకాడికి దోచుకునే ముఠాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. అమాయకులు దొరికితే చాలు వారిని నిలువునా ముంచెస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో కొత్త రకం మోసం వెలుగుచూసింది. జలకన్య కన్ను అంటూ రూ.2 కోట్లకు విక్రయించే యత్నం చేశారు. లక్కీస్టోన్‌లో లైట్‌ను ఏర్పాటు చేసి మోసం చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వరంగల్ కు చెందిన చందూతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred