హైద్రాబాద్లో మరోసారి ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులు: వారంలో నాలుగు కేసులు నమోదు
హైద్రాబాద్ నగరంలో మరోసారి ఆన్లైన్ లోన్ యాప్ వేధింపుల కేసులు నమోదౌతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే నాలుగు కేసులు నమోదయ్యాయి. లోన్ తీసుకొన్న బాధితులను వేధింపులకు గురి చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్: Hyderabad నగరంలో మరోసారి ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే హైద్రాబాద్ సిటీ పోలీసులకు నాలుగు ఫిర్యాదులు అందాయి. గతంలో Online loan app కేసులకు సంబంధించి హైద్రాబాద్ నగర పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. హైద్రాబాద్ నగరంలోని Yousufguda కు చెందిన యువతి ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా రూ. 10 లక్షల రుణం తీసుకొంది. అయితే లోన్ యాప్ నిర్వాహకులు యువతిని వేధింపులకు గురి చేశారు. దీంతో ఆ యువతి తాను తీసుకొన్న రూ. 10 లక్షలకు అదనంగా రూ. 2.9 లక్షలు చెల్లించింది. నగరంలోని కృష్ణానగర్ లో కూడా ఇదే తరహలో మరో కేసు కూడా నమోదైంది. ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా ఓ మహిళా రూ. 33 వేలు రుణం తీసుకొంది. దీంతో ఆ యువతిని డబ్బులు చెల్లించాలని ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు.
also read:రూ. 300 కోట్లు కొల్లగొట్టే ప్లాన్: నకిలీ ఎస్ఐ అనిల్తో చైనా కేటుగాళ్ల ఒప్పందం
ఫేక్ లెటర్ హెడ్ తో బ్లాక్ మెయిల్ చేశారు కాల్ సెంటర్ నిర్వాహకులు. బాధిత యువతి కుటుంబీకుల ఫోన్ నెంబర్లను తీసుకొని వాట్సాప్ గ్రూప్ తయారు చేసి బాధితురాలిని వేధింపులకు గురి చేశారు నిందితులు. ఈ వేధింపులు తాళలేక బాధితురాలు రూ. 33 వేలకు గాను లక్ష రూపాయాలను చెల్లించింది. హైద్రాబాద్ old city చెందిన ఆటో డ్రైవర్ గో క్యాష్ యాప్ ద్వారా రూ. 5 వేల లోన్ తీసుకొన్నాడు ఆన్లైన్ యాప్ ద్వారా లోన్ కోసం ధరఖాస్తు చేసుకొనే సమయంలో తెలియక అన్ని నిబంధనలను ఆటో డ్రైవర్ యాక్సెప్ట్ చేశాడు.
దీంతో Auto Driver కు లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు.ఈ వేధింపులు భరించలేక బాధితుడు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే తరహలో మరొకరు కూడా వేధింపులకు గురైనట్టుగా పోలీసులకు పిర్యాదు అందింది.ఆన్ లైన్ లోన్ యాప్ ల వెనుక China కుచెందిన సంస్థలున్నాయని హైద్రాబాద్ పోలీసులు గతంలలోనే నిర్ధారించారు. లోన్ యాప్ కేసుల్లో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. గతంలో నమోదైన కేసుల్లో పలువురిని అరెస్ట్ చేశారు.
ఆన్లైన్ లోన్ యాప్ కేసుల్లో హైద్రాబాద్ పోలీసులు సీజ్ చేసిన నగదును నకిలీ పోలీసులు బ్యాంకు నుండి డ్రా చేశారు.ఈ కేసులో కూడా హైద్రాబాద్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు . ఆన్లైన్ లోన్యాప్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాల నుండి డబ్బులను డ్రా చేసుకొనేందుకుగాను చైనా కేటుగాళ్లు అనిల్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొన్నారు.నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తిన అనిల్ ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అనిల్ను విచారణ చేస్తే కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆన్లైన్ యాప్ కేసులో పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను నకిలీ ఎస్ఐ అనిల్ డీఫ్రీజ్ చేయించారు. కోల్కత్తాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు డీఫ్రీజ్ చేయాలని అనిల్ రాసిన లేఖ ఆధారంగా బ్యాంకు అధికారులు ఈ ఖాతాలోని నిధులను మరో బ్యాంకు ఖాతాలోకి మళ్లించారు.