మైండ్స్పేస్లో కరోనా కలకలం: ఖాళీ అయిన ఆఫీసులు
హైద్రాబాద్ లో కరోనా కలకలం రేపుతోంది. మైండ్ స్పేస్ లో రెండు ప్రముఖ సంస్థలు ఇంటి నుండే పనిచేయాలని ఉద్యోగులకు అవకాశాలు కల్పించాయి.
హైదరాబాద్: కరోనా వైరస్ హైద్రాబాద్ వాసులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. హైద్రాబాద్ లోని రెండు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుండే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశాయి. ఓ కంపెనీలో పనిచేస్తున్న టెక్కీకి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానాలు రావడంతో ఈ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను ఇంటి నుండే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Also read:45 మందికి నెగిటివ్ రిపోర్ట్: ఇద్దరి శాంపిల్స్ మరోసారి పూణెకు
హైద్రాబాద్ రహేజా మైండ్ స్పేస్ బిల్డింగ్ నెంబర్ 20 లో 9వ, ఫ్లోర్లో డీఎస్ఎం కంపెనీ ఉంది. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులను ఇంటి నుండే పనిచేయాలని మెయిల్ పంపింది. మరో వైపు మైండ్ స్పేస్ బిల్డింగ్లో ఉన్న ఓపెన్ టెక్ట్స్, సంస్థ కూడ ఉద్యోగులను కూడ వర్క్ ఫ్రం హోం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సంస్థలు కూడ రహేజా మైండ్ స్పేస్ భవనంలో ఉన్నాయి.
Also read:సికింద్రాబాద్లో టెక్కీకి కరోనా: స్కూళ్లకు సెలవులు
సుమారు వెయ్యికి మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఓ టెక్కీ ఇటలీ నుండి హైద్రాబాద్ కు వచ్చింది. ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇంకా నిర్ధారణ కాలేదు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ రెండు సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుండి పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ఇవాళ ఉదయం విధులకు వచ్చిన ఉద్యోగులను కూడ ఆయా సంస్థలు ఇంటికి పంపించాయి.