Asianet News TeluguAsianet News Telugu

మొన్న గీతారెడ్డి.. నేడు కానిస్టేబుల్, రాహుల్ పాదయాత్రలో వరుస అపశృతులు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో వరుస అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. మొన్న మాజీ మంత్రి గీతారెడ్డి కిందపడి గాయాల పాలవ్వగా.. ఇవాళ ఓ కానిస్టేబుల్ కాలి మీదుగా కారు దూసుకెళ్లింది. 
 

constable injured in congress mp rahul gandhi bharat jodo yatra
Author
First Published Nov 5, 2022, 2:50 PM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  అయితే ఈ పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ భద్రతా విధుల్లో వున్న శివకుమార్ అనే కానిస్టేబుల్ కాలిపై నుంచి కాన్వాయ్‌లోని ఓ వాహనం వెళ్లింది. దీంతో ఆయన గాయపడ్డారు. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది శివకుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ వారం మొదట్లో రాహుల్ వెంట పాదయాత్రలో నడిచిన మాజీ మంత్రి గీతారెడ్డి రోడ్డుపై పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు, భద్రతా సిబ్బంది గీతా రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. 

అంతకుముందు మంగళవారం కూడా భారత్ జోడో యాత్రలో చిన్నపాటి అపశృతిచోటుచేసుకుంది. రాహుల్ పాదయాత్రలో చిన్నపాటి తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నితిన్ రౌత్‌కు గాయాలు అయ్యాయి. నితిన్ రౌత్ భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న సమయంలో పోలీసులు నెట్టివేయడంతో ఈ ఘటన జరిగినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నితిన్ రౌత్ కుడి కన్ను, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని వాసవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ALso REad:భారత్ జోడో యాత్ర ... రాహుల్ గాంధీపై కేసు, కేజీఎఫ్ 2 వల్లే

ఈ విషయంపై దీక్ష రౌత్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నిన్న హైదరాబాద్‌లో మా నాన్న భారత్‌ జోడో యాత్రలో స్పృహ తప్పి పడిపోయారు. అతడి తలపై చిన్న గాయమైంది. ఆయన త్వరగా కోలుకుని మహారాష్ర్టకు భారత్ జోడో యాత్ర చేరుకున్నప్పుడు.. ఆ ప్రజా ఉద్యమంలో చేరతారని ఆశిస్తున్నాను’’ అని దీక్ష రౌత్ ట్వీట్ చేశారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిత్రాలను కూడా షేర్ చేశారు.   

Follow Us:
Download App:
  • android
  • ios