Hyderabad: రెండు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో చ‌లి తీవ్ర‌త గ‌ణ‌నీయంగా పెరిగింది. నగర జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయనీ, గత వారం తెలంగాణ వ్యాప్తంగా సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 

Telangana witness cold nights: రెండు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో చ‌లి తీవ్ర‌త గ‌ణ‌నీయంగా పెరిగింది. నగర జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయనీ, గత వారం తెలంగాణ వ్యాప్తంగా సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చ‌లి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతూ.. చలి తీవ్ర‌త క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌ని వాతావ‌ర‌ణ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. నవంబర్‌లో శీతాకాలం ప్రారంభం కావడానికి ముందు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. మంగళవారం రాత్రి, ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతూ సాధార‌ణం నుండి -2°C విచలనాన్ని చూపుతూ 17.8°Cకి పడిపోయింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) డేటా ప్రకారం, రంగారెడ్డిలోని రెడ్డిపల్లిలో ఉష్ణోగ్రత -4 ° C వరకు తగ్గి 12.8 ° C కు చేరుకుంది. భారత వాతావరణ శాఖ (IMD) డేటా ప్రకారం, నగరంలోని GHMC పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 18°C ​​కంటే తక్కువగా నమోదయ్యాయి. గత వారం సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణ వ్యాప్తంగా 20°C వద్ద ఉన్నాయి. నగరంలో ఉష్ణోగ్రత 14° నుండి 17°C వరకు తగ్గుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

అయితే, రాత్రివేళ‌ల్లో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోగా, ప‌గ‌టిపూట మాత్రం పెద్ద‌గా ఎలాంటి మార్పులు లేవు. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 32.4°C వద్ద నమోదైంది, ఇది సాధారణం కంటే 1°C పెరిగింది. TSDPS నుండి వచ్చిన డేటా ప్రకారం, గత వారం నగరం 34.6 ° C వద్ద పగటి ఉష్ణోగ్రతలను న‌మోదుచేసింది. రాష్ట్రంలోకి ఉత్తరాది రుతుపవనాలు ప్రవేశించడమే ఈ శీతాకాలం ప్రారంభానికి కారణమని ఐఎండీ వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అల్పపీడన ద్రోణి, ఈశాన్య గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.