డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన బీజేవైఎం.. తీవ్ర ఉద్రిక్తత..
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా బీజేవైఎం నేతలు డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా బీజేవైఎం నేతలు డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలోనే వారు డీజీపీ కార్యాలయం ఆవరణలోకి దూసుకెళ్లారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. ఈ క్రమంలలోనే పోలీసులకు బీజేవైఎం నేతలు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ, వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు బీజేవైఎం నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి పోలీసు స్టేషన్కు తరలించారు. ఇక, హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ మార్కులు కలిపి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.