ప్రణయ్ కి న్యాయం...సోషల్ మీడియాలో అమృత ఉద్యమం
జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరిట ప్రత్యేకంగా ఓ పేజీని క్రియేట్ చేసింది. ఆ పేజీ ని అందరూ లైక్ చేసి.. తమకు న్యాయం చేయాలంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా కోరుతోంది.
మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ న్యాయం చేయాలంటూ ఆయన భార్య అమృత ఉద్యమం చేపట్టారు. కూతురు తమ కులస్థుడిని కాకుండా వేరే కులస్థుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే అక్కసుతో.. అమృత తండ్రి ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ప్రణయ్ భార్య అమృతను, ఆయన కుటుంబసభ్యులను రాజకీయ నాయకులు, ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కులాన్ని రూపుమాపాలని కోరుతూ పలువురు ప్రణయ్ కి మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమృత సోషల్ మీడియా వేదిక గా ఉద్యమం చేపట్టింది.
జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరిట ప్రత్యేకంగా ఓ పేజీని క్రియేట్ చేసింది. ఆ పేజీ ని అందరూ లైక్ చేసి.. తమకు న్యాయం చేయాలంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా కోరుతోంది. ఆమె కోరుకున్నట్లుగానే.. ఆమె ఉద్యమాన్ని చాలా మంది స్పందిస్తున్నారు. ఆ పేజీని లైక్ చేసి తమ మద్దతు తెలుపుతున్నారు.
అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ
ప్రణయ్ కి విగ్రహం...కేటీఆర్ అనుమతి ఇవ్వాలి
అమృతను పరామర్శించి, సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన జానారెడ్డి
ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...