Asianet News TeluguAsianet News Telugu

Minor Girl Rape case: హైద‌రాబాద్‌లో దారుణం.. బాలికపై అత్యాచారం ఆపై.. బ‌ల‌వంతంగా వ్య‌భిచారం

Minor Girl Rape case: ఇంట్లో వారితో గొడవపడి బయటికెళ్లిన బాలికపై కామాంధులు క‌న్నేశారు. మ‌య మాటలు చెప్పి.. తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంత‌టితో ఆగ‌కుండా వ్యభిచారం కూడా చేయించారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది.
 

A MINOR GIRL WAS RAPED AFTER COMING OUT OF THE HOUSE IN OLD CITY OF HYDERABAD
Author
Hyderabad, First Published Jan 5, 2022, 4:39 AM IST

Minor Girl Rape case:  హైద‌రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో  గొడ‌వ ప‌డి అర్థ‌రాత్రి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఒక బాలికపై కొంద‌రు దాడి చేశారు. అంతే కాకుండా ఆ బాలికపై అత్యాచారం చేశారు. వీటితో ఆగ‌కుండా ఆ బాలిక‌ను వ్య‌భిచార కూపీలోకి దించారు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని పాతబ‌స్తీలో చోటు చేసుకుంది.

హైద‌రాబాద్ లోని పాత బ‌స్తీ కిష‌న్ బాగ్ ప్రాంతానికి చెందిన ఒక బాలిక త‌న ఇంట్లో వాళ్లో గొడ‌వప‌డి న‌వంబ‌ర్ 20 న బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌దిరోజుల పాటు ఆ బాలిక కోసం వెతికి చివ‌ర‌కు డిసెంబర్ 1వ తేదీ బాధిత బాలిక తల్లి బహదూర్ పురా పోలీసులను ఆశ్ర‌యించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. చివ‌రికి ఓ ఇంటిపై దాడి చేయ‌గా.. బాలిక దొరికింది. అయితే.. ఆమెను ప్ర‌శ్నించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి.

Read Also: తెలంగాణలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 1000 కేసులు, ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి

హైద‌రాబాద్ లోని పాత బ‌స్తీ కిష‌న్ బాగ్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక త‌న అక్క‌తో గొడ‌వప‌డి న‌వంబ‌ర్ 20 న బ‌య‌ట‌కు వ‌చ్చింది.  అయితే..  అర్ధరాత్రి ఒంటరిగా కనిపించిన బాలికపై కామాంధులు కన్నేశారు.   కొందరు యువకులు ఆ బాలిక‌ను  వెంబడిస్తే.. సమీర్ అనే  ఆటో డ్రైవర్ గమనించి ఆకతాయిల నుంచి రక్షించాడు. బాలిక వివరాలను ఆటో డ్రైవర్ ఆరా తీయగా ఇంటికి వెళ్లనని చెప్పడంతో ఆటో డ్రైవర్ సమీర్, అతని స్నేహితుడు హఫీజ్​తో కలిసి బాలికకు మ‌య మాట‌లు చెప్పి.. అత్తాపూర్​ పరిధిలోని ఉప్పర్​పల్లిలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లారు. ఆ త‌రువాత‌ ఆ బాలిక‌కు మ‌ద్యం తాగించి.. అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంత‌టితో ఆ బాలిక‌ను వీడిచిపెట్ట‌కుండా.. న‌గ‌రంలోని మైలార్ దేవ్ ప‌ల్లి లో మ‌రో ఇద్ద‌రు మ‌హిళల సాయంతో ఒక ఇంట్లో ఉంచి వ్య‌భిచారం చేయిస్తున్నారని బహదూర్​ పురా సీఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. బాలికకు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని సీఐ తెలిపారు.

Read Also: మోడీ మళ్లీ ప్రధాని కాకూడదు.. పాకిస్తాన్ నటుడి సంచలన వ్యాఖ్యలు
 

సెల్ ఫోన్ లోకేష‌న్ ఆధారంగా.. 
బాధిత బాలిక త‌న‌ అక్క ఫోన్​కు తాను ఉండే.. లోకేషన్ పంపింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మైలార్​దేవ్​ పల్లి అలీనగర్​లోని ఓ ఇంట్లో దాడి చేసి బాలికను రక్షించారు. అక్కడే ఉన్న ముఠాలోని ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios