పాడు పని చేసిన ముసలోనికి ... దేహశుద్ధి
- ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం
- 60 ఏళ్ల ముసలోడి నిర్వాకం
- దేహశుద్ధి చేసిన స్థానికులు
- అరెస్టు చేసి రిమాండ్ చేసిన పోలీసులు
ఆతడు 60 ఏండ్ల ముసలోడు. కానీ అభం శుభం తెలియని చిన్నారి పాలిట రాక్షసుడు అయ్యాడు. ముక్కుపచ్చలారని ఏడేళ్ల చిన్నారిపై ఆ 60 ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేశాడు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటన కుషాయిగూడలో జరిగింది.
తన ఇంటి పక్కన ఉండే చిన్నారికి మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లిన యాదయ్య అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని చాక్లెట్లు ఆశ చూపాడా ముసలోడు. అయినా భయాందోళనకు గురైన ఆ చిన్నారి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.
దీంతో యాదయ్యను పట్టుకుని స్థానికులు దేహశుద్ది చేశారు. పొట్టు పొట్టుగా కొట్టిన తర్వాత ఆ ముసలోన్ని పోలీసులకు అప్పగించారు. చిన్నారి ని అత్యాచారం చేసినందుకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి