Asianet News TeluguAsianet News Telugu

BJP: 20 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు.. ఐదు సెగ్మెంట్ల వివరాలు

బీజేపీ ఈ నెల 20వ తేదీ నుంచి ఐదు సెగ్మెంట్‌లలో యాత్రలు చేపట్టనుంది. ఈ విజయ సంకల్పాలకు సంబంధించిన పోస్టర్‌ను ఈ రోజు కిషన్ రెడ్డి విడుదల చేశారు.
 

telangana bjp chief kishan reddy launched poster for his political campaign kms
Author
First Published Feb 12, 2024, 2:20 AM IST

తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను ప్రకటించారు. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా నరేంద్ర మోడీని మూడో సారి ప్రధానమంత్రిని చేయడంలో భాగంగా ఈ యాత్రలు ఉంటాయని వివరించారు. ఈ యాత్రకు సంబంధించి శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ లీడర్లు కే లక్ష్మణ్, జితేందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, శిల్పా రెడ్డి సహా పలువురు హాజరయ్యారు. 

ఈ యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన మొదలువుతుంది. మార్చి 1వ తేదీన ముగుస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీని లోక్ సభ ఎన్నికల్లో గెలిపించాలనే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుందని వివరించారు. ‘ఇప్పటికే దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణమే ఉన్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని వర్గాల్లో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ముందే ఈ వాతావరణం ఏర్పడింది’ అని తెలిపారు.

Also Read: మీ పేరెంట్స్ నాకు ఓటేయకపోతే 2 రోజులు తినకండి.. స్కూల్ పిల్లలకు ఎమ్మెల్యే వింత సలహా.. వైరల్..

ఈ యాత్ర ఐదు సెగ్మెంట్లుగా సాగుతుంది. ఈ ఐదు సెగ్మెంట్లు అన్ని 17 లోక్ సభ స్థానాలను కవర్ చేస్తాయి.

1. కొమరం భీం యాత్ర: ఈ యాత్ర ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.

2. శాతవాహన యాత్ర: ఈ యాత్ర కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెల్ల నియోజకవర్గాల్లో సాగుతుంది.

3. కాకతీయ యాత్ర: ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాల మీదుగా ఈ  యాత్ర జరుగుతుంది.

4. భాగ్యనగర యాత్ర: భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కజ్ గిరి నియోజకవర్గాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది.

5. క్రిష్ణమ్మ యాత్ర: క్రిష్ణమ్మ యాత్ర మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ చేపడుతుంది.

ఈ యాత్రలు అన్నీ వివిధ నియోజకవర్గాలలో మొదలైనా.. హైదరాబాద్‌కు చేరడంతో ముగుస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు.  బీజేపీ అన్ని 17 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో ఎంపీ(ప్రస్తుతం ఈ స్థానానికి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు) స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios