ప్రస్తుతం డిల్లీలో వున్న రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా వీరిని ఆహ్వానించనున్నారు రేవంత్. ఇప్పటికే రేవంత్ ప్రమాణస్వీకారానికి సోనియా రావడం ఖాయమైనట్లు తెలుస్తోంది.
- Home
- Election
- Telangana Elections
- Telangana Assembly Election 2023 LIVE : నేడు సోనియాగాంధీతో రేవంత్ భేటీ
- FB
- TW
- Linkdin
Follow Us
Telangana Assembly Election 2023 LIVE : నేడు సోనియాగాంధీతో రేవంత్ భేటీ
)
తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు కసరత్తు చేస్తోంది. ఇవాళ సాయంత్రానికి ముఖ్యమంత్రి పేరును అధిష్టానం ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ పరిస్ధితులు చూస్తుంటే మంగళవారం కూడా కష్టమే అనిపిస్తోంది.
రేవంత్ ప్రమాణస్వీకారానికి సోనియా గాంధీ...
నేడు సోనియాగాంధీతో రేవంత్ భేటీ
రెండో రోజు కూడా డిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి ఖాయం కావడంతో కేబినెట్ కూర్పుపై అదిష్టానంతో చర్చలు జరపనున్నారు రేవంత్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను నేడు రేవంత్ కలవనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... రేపే ప్రమాణస్వీకారం
సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి అద్భుత విజయాన్ని అందించిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డినే సీఎంగా నియమించింది. డిసెంబర్ 7న అంటే రేపు ఆయన ప్రమాణస్వీకారం వుంటుందని కాంగ్రెస్ ప్రకటించింది.
సీఎం ఎవరు.. ఇంకా సస్పెన్సే
తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు కసరత్తు చేస్తోంది. ఇవాళ సాయంత్రానికి ముఖ్యమంత్రి పేరును అధిష్టానం ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ పరిస్ధితులు చూస్తుంటే మంగళవారం కూడా కష్టమే అనిపిస్తోంది.
కేసీ వేణుగోపాల్తో భట్టి భేటీ
తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించింది. మరోవైపు.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ ఇంటికి డీకే శివకుమార్, మాణిక్ రావ్ థాక్రేలు వెళ్లారు.
ఎల్లా హోటల్కు కమ్యూనిస్ట్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం మకాం వేసిన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్కు కమ్యూనిస్ట్ నేతలు వెళ్లారు. సీపీఐ నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు వెళ్లారు. సాయంత్రానికి తెలంగాణ కొత్త సీఎం ఎవరో క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఢిల్లీలో వున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సాయంత్రానికి హైదరాబాద్ రానున్నారు.
రేవంత్ను సీఎంని చేయాలంటూ నినాదాలు
తెలంగాణలో సీఎం ఎవరన్నది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు , రాజకీయాలకు గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా కేంద్రంగా మారింది. ఇక్కడ సీఎల్పీ సమావేశం జరగ్గా, కాంగ్రెస్ నేతలంతా ఇక్కడే మకాం వేశారు. ఈ క్రమంలో మంగళవారం హోటల్ ఎల్లా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఆందోళనకు దిగడంతో పాటు హోటల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని నిలువరించి బయటకు పంపారు పోలీసులు.
సాయంత్రం హైదరాబాద్కు డీకే శివకుమార్
తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తన నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లతో సమావేశమయ్యారు. ఈ సాయంత్రానికి కేపీసీసీ చీఫ్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి హైదరాబాద్ తిరిగి రానున్నారు. రాత్రి నాటికి తెలంగాణ సీఎం ఎవరో క్లారిటీ రానుంది.
ఖర్గేతో ముగిసిన రాహుల్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్కే అప్పగించారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలు భేటీ అయ్యారు. సీఎం ఎవరన్నది సాయంత్రానికి తెలిసే అవకాశం వుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
తుదిదశకు తెలంగాణ సీఎం ఎంపిక చర్చలు... ఖర్గే నివాసానికి రాహుల్, కేసి వేణుగోపాల్
దేశ రాజధాని డిల్లీలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి, మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించేందుకు ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంటికి రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్ చేరుకున్నారు. అలాగే డికె శివకుమార్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్ రావ్ థాక్రే భేటీ అయ్యారు. అందరి ఏకాభిప్రాయంతో తెలంగాణ ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నారు.
డికె శివకుమార్ తో ఉత్తమ్ భేటీ...
దేశ రాజధాని డిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో డికె శివకుమార్ భేటీ అయ్యారు. అలాగే భట్టి విక్రమార్క కూడా జాతీయ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం ఏఐసిసి చేతికి చేరిన సమయంలో ఉత్తమ్, భట్టీ డిల్లీకి చేరడం ఉత్కంఠకు దారితీసింది.
ఇవాళ సాయంత్రంలోపు తెలంగాణ సీఎం ప్రకటన...
ఇవాళ సాయంత్రం లోపు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తామని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇప్పటికే డిల్లీకి చేరుకున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించిన అనంతరం ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.
డిల్లీకి చేరిన కాంగ్రెస్ రాజకీయాలు...
ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీలను భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు కలిసే అవకాశాలున్నాయి. ఇందుకోసం వాళ్లు ఇప్పటికే దేశ రాజధాని డిల్లీకి చేరుకున్నారు.
ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా...
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంపీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో భేటీ కానున్నారు.
తెలంగాణ సీఎంగా రేవంత్..? ప్రమాణస్వీకారానికి మహూర్తం ఖరారట
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఏఐసిసి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న 10 గంటలకు రేవంత్ తో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.
నేడే తెలంగాణ సీఎం ప్రకటన... డిల్లీలో వేగంగా నిర్ణయాలు
మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డికె శివకుమార్, మాణిక్ రావు థాక్రే భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ఎమ్మెల్యేల ముందే వెల్లడించనున్నారు డికె. ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తెలంగాణ నూతన సీఎం ఎవరన్నది తేలనుంది.
ప్రాణం వున్నంత వరకు కేసీఆర్తోనే : పాడి కౌశిక్ రెడ్డి
తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు. తన పాత ఫోటో పెట్టి రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హుజురాబాద్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, ఫేక్ ప్రచారాలను ఎవరూ నమ్మొద్దన్నారు. హుజురాబాద్ను గొప్పగా అభివృద్ధి చేసుకుందామని కౌశిక్ రెడ్డి అన్నారు. తన గొంతులో ప్రాణం వున్నంత వరకు కేసీఆర్, ఆయన కుటుంబంతోనే వుంటానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ ఓటమిపై అసదుద్దీన్ స్పందన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమికి కారణాలు గుర్తించి బీఆర్ఎస్ సరిదిద్దుకుంటుందని ఒవైసీ ఆకాంక్షించారు. కేటీఆర్, హరీశ్రావులకు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అవకాశం దొరికిందన్నారు.
కొత్త ప్రభుత్వానికి సెక్రటేరియట్లో ఛాంబర్లు రెడీ
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అందుకు తగినట్లుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సచివాలయంలో సాధారణ పరిపాలనా శాఖ ఛాంబర్లను సిద్ధం చేస్తోంది. పాత బోర్డులను తొలగించడంతో పాటు ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను ఖాళీ చేస్తున్నారు. కొత్త మంత్రుల కోసం కొత్త సిబ్బందితో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో మీడియాకు ప్రత్యేక గది కేటాయించారు.
తెలంగాణ భవన్లో ప్రజలకు అందుబాటులో వుంటాం : కేటీఆర్
ఇకపై తెలంగాణ భవన్ నుంచి ప్రజలకు అందుబాటులో వుంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని, ఎన్నికల్లో గౌరవ ప్రదమైన స్థానాలు సాధించిందని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.