కేసీఆర్ వి మాయమాటలే, ఆయనకు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే : విజయశాంతి
కేసీఆర్కు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని స్పష్టం చేశారు. కేసీఆర్ మాటలను నమ్మెుద్దని హితవు పలికారు. మరోవైపు బీజేపీపైనా విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొస్తానని, ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.
పెద్దపల్లి: తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చెప్పేవన్నీ మాయమాటలేనని చెప్పుకొచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్కు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని స్పష్టం చేశారు.
కేసీఆర్ మాటలను నమ్మెుద్దని హితవు పలికారు. మరోవైపు బీజేపీపైనా విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొస్తానని, ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.
బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బును ఖాళీ చేసిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయాడని స్పష్టం చేశారు. బీజేపీ చేపట్టిన నోట్లరద్దు, జీఎస్టీ వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.
మోదీని మళ్లీ ప్రధానిని చేయడం కోసం కేసీఆర్ అనేక మాయమాటలు చెబుతారని వాటిని పట్టించుకోవద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకం కింద ప్రతి నెలా రూ.6వేల చొప్పున పేదల ఖాతాల్లో వేస్తామని విజయశాంతి హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని, మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణను అప్పులు రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.