విధుల్లోకి ఆర్టీసీ కార్మికులు.. డిపోల వద్ద సందడి
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సుఖాంతమైంది. దాదాపు 54 రోజులపాటు కార్మికులు సమ్మె చేపట్టగా.... నేటి నుంచి కార్మికులు విధుల్లోకి చేరారు.
తీవ్ర నిరాశా నిస్పృహలు, ఆవేదన గూడు కట్టుకున్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు.
ఎప్పటిలా విధుల్లో చేరిన ఉద్యోగులు కేసీఆర్ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని ఆర్టీసీ డిపోల వద్ద డ్రైవర్లు కండక్టర్లతో సందడి నెలకొంది.
ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్ కోర్టుకు పంపగలదని, అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడతాయని, కానీ తాము అలా చేయడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరటనిచ్చారు.
ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ.100 కోట్లు ఇస్తున్నానని కూడా ప్రకటించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.