కేసీఆర్కు 16, జగన్కు 22.. మరి చక్రం తిప్పేదెవరు: విజయశాంతి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రచార సభలో పాల్గొన్న ఆమె న్యాయ్పథకం ప్రకటించి రాహుల్ గాంధీ హీరో అయ్యారని, జీఎస్టీ, నోట్ట రద్దుతో మోడీ జీరో అయ్యారని ధ్వజమెత్తారు.
16 సీట్లు గెలిచి టీఆర్ఎస్ కేంద్రంలో ఏం చేస్తుందని ఆమె ప్రశ్నించారు. 16 సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరి ఏపీలో 20-22 ఏంపీ సీట్లు గెలుస్తామంటున్న జగన్ ఏం తిప్పాలని విజయశాంతి ఎద్దేవా చేశారు.
తక్కువ సీట్లున్న టీఆర్ఎస్... ఎక్కువ సీట్లు గెలిచే పార్టీని ఎలా శాసిస్తుందని.. కేసీఆర్ చక్రం తిప్పేదాకా జగన్ ఊరుకుంటారా అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. సారు, కారు, సర్కారు అంటున్న కేటీఆర్.. కేసీఆర్ ‘‘సారు‘‘... ప్రధాని ‘‘కారు’’ అని ఆరోపించారు.
కేసీఆర్.. జగన్ ఓ ఒప్పందానికి వచ్చినా... మమతా, మాయావతి వంటి సీనియర్ నేతలు కేసీఆర్ చెప్పు చేతల్లో పనిచేస్తారా..? అని ఆమె ప్రశ్నించారు.