సార్వత్రిక ఎన్నికల వేళ..హైదరాబాద్ నగరంలో నగదు కలకలం రేపింది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ..హైదరాబాద్ నగరంలో నగదు కలకలం రేపింది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి నుంచి పోటీచేస్తున్న ఓ అభ్యర్థి ఈ నగదు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

కాగా.. ఈ నగదు తీసుకువెళ్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడికారులో నగదు తీసుకువచ్చి.. వోల్క్స్ వాగెన్ లోకి మారుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారులో మొత్తం రూ.49లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. ఆ నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.
