Asianet News TeluguAsianet News Telugu

కళ్లెదుట యాక్సిడెంట్.. వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన ఎంపీ కవిత

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఎంపీ కవిత. సోమవారం సాయంత్రం డిచ్ పల్లి మండలం కేశ్పల్లి లో గడ్డం ఆనంద్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరే కార్యక్రమానికి నిజామాబాద్  నుండి ఎంపీ కవిత వెళ్తున్నారు. 

mp kavitha help to injured person
Author
Hyderabad, First Published Mar 18, 2019, 10:28 PM IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఎంపీ కవిత. సోమవారం సాయంత్రం డిచ్ పల్లి మండలం కేశ్పల్లి లో గడ్డం ఆనంద్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరే కార్యక్రమానికి నిజామాబాద్  నుండి ఎంపీ కవిత వెళ్తున్నారు. 

ధర్మారం గ్రామం మూల మలుపు వద్ద కాకతీయ స్కూల్ బస్సు ముందటి  టైర్ కింద అదే గ్రామానికి చెందిన జిలాని ద్విచక్రవాహనం, బస్సు ముందు నడిరోడ్డుపై పడిపోయిన జిలాని అప్పుడే అటుగా వచ్చిన ఎంపీ కవిత చూసి కారు దిగి అంబులెన్స్ కు డాక్టర్ కు ఫోన్లు చేయించారు. 

సమీపంలోనే ఉన్న కుటుంబ సభ్యులు అక్కడికి రాగానే వారిని ఓదార్చారు. అంబులెన్స్ వస్తోందని దైర్యం చెప్పారు. ప్రమాద స్థలికి కేవలం 100 మీటర్ల దూరంలో నే జిలానీ ఇల్లు ఉంది. భీంగల్  కు చెందిన జిలానీ వంట పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. 

అంబులెన్స్ లో కుటుంబ సభ్యులను జిలానీతోపాటు ఆసుపత్రికి పంపించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె డాక్టర్లకు ఫోన్ చేసి ఇ కోరారు. ఆమె వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు  విజీ గౌడ్, ఆకుల లలిత, ఇతర నాయకులు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios