నామినేషన్ వేసిన ఎంపీ కవిత
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నామినేషన్ వేశారు. కాగా.. నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు ఆమె నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమంతుని దర్శించుకున్నారు.
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నామినేషన్ వేశారు. కాగా.. నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు ఆమె నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమంతుని దర్శించుకున్నారు.భర్త అనిల్ తో కలిసి ఎంపి కవిత ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు.
నామినేషన్ పత్రాలను హనుమంతుని పాదాల చెంత ఉంచి మొక్కుకున్నారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాంకిషన్ రావు, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ సుమనారెడ్డి, నాయకులు ఈగ గంగారెడ్డి, మోహన్ రెడ్డి తో పాటు పలువురు కార్పొరేటర్లు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.