Asianet News TeluguAsianet News Telugu

రంజిత్ రెడ్డిని గెలిపించే బాధ్యత నాది.. మహేందర్ రెడ్డి

రంజిత్ రెడ్డిని గెలిపించే బాధ్యత తనదని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. 

ex minister mahinder reddy comments on party candidate ranjith reddy
Author
Hyderabad, First Published Mar 22, 2019, 1:07 PM IST

రంజిత్ రెడ్డిని గెలిపించే బాధ్యత తనదని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహేందర్ రెడ్డి ఇంటికి  ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, యాదయ్య, మహేష్ రెడ్డి, పార్లమెంట్ ఇంఛార్జి గట్టు రామచంద్రరావులు విచ్చేశారు. కాగా.. వారందరినీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..రంజితద్ రెడ్డి  మొదటినుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. పార్టీ కోసం పనిచేశారని చెప్పారు.  రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ వ్యాపార సంస్థలు రంజిత్ కి ఉన్నాయన్నారు.  ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. రంజిత్ రెడ్డిని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు వివరించారు.

 అనంతరం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. 
చేవెళ్లపార్లమెంట్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి  కృతజ్ఞతలు తెలిపారు. .
తనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి మహేందర్ గారికి , నియోజకవర్గ ఎమ్మెల్యే అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

తాను జీవితాంతం సీఎం కి రుణపడి ఉంటానన్నారు. ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయనన్నారు. చెవెళ్ల ప్రజలకు అండదండగా, తోడునీడగా ఉంటానన్నారు.  ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటానని హామీ ఇచ్చారు.  ప్రజలు గెలిపించి పంపిస్తే పార్లమెంట్ లో చేవెళ్ల, తెలంగాణ ప్రజల గొంతుక అవుతానన్నారు. 

కేంద్రాన్ని యాచించే బదులు శాశిద్దామన్నారు.  ఎర్రకోట మీద జెండా ఎగురవేయడం లో మన భాగస్వామ్యం ఉంటే నిధులు వాటంతట అవే వస్తాయన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios